తెలంగాణా వాదం -మేధావులా?మేతావులా?-1

'నాకు నెలకు లక్ష జీతం వట్టిగ ఇస్తలేరు.30 ఏళ్ళుగా యూనివర్సిటీ కు సేవ చేస్తున్నా.ఉద్యోగం చేస్తున్నంతమాత్రాన సర్కారుకు విశ్వసనీయుడుగా ఉండాల్సిన అవసరం లేదు.రాజ్యాంగానికి మాత్రమే విశ్వాసపాత్రుడిగా ఉంటా.ఒక పౌరునిగా కర్తవ్యాన్ని నిర్వర్స్తిస్తా.' అని శలవిచ్చారు తెలంగాణ జాక్ చైర్మన్ ప్రొ.కోదండరాం .
గవర్నరుగానో,రాష్ట్రపతిగానో,లేక ఎన్నికలప్రధానాధికారిలాంటి రాజ్యాంగబధ్ధమైన పదవుల్లో ఉంటే రాజ్యాంగానికి విశ్వసనీయుడుగా ఉంటానంటే అర్ధముందిగాని,విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడుగా ఉన్న ఈయన రాజ్యాంగానికి విశ్వాసపాత్రుడుగా ఉంటాననడం తననుగురించి తాను ఎక్కువగా ఊహించుకొని పలికే ప్రగల్భాలు,వ్యర్ధ ప్రేలాపనలు.
నాయనా ప్రొ.కోదండరాం మీదేమీ రాజ్యాంగపరమైన కొలువు కాదు.విశ్వవిద్యాలయ నౌకరీనిబంధనల కనుగుణంగా మీకు ప్రొ.ఉద్యోగం ఇచ్చారు.ఈ ఉద్యోగ సక్రమ నిర్వహణకు రాజ్యాంగం లాంటి పెద్దమాటలు వాడాల్సిన పని లేదు.గత రెండు ఏళ్ళుగా ప్రత్యేక తెలంగాణా తలకెత్తుకొని ,నిరుద్యోగ రాజకీయనాయకులతో కలసి,సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ,అరాచకాలు సృష్టిస్తూ కాలయాపన చేస్తున్నారుగాని ప్రొఫెసర్ గా మీవిధులు నిర్వర్తించడం లేదు.విద్వేషాలు రెచ్చగొట్టడం,అరాచకం సృష్టించడం లాంటివి రాజ్యాంగవిరుధ్ధ కార్యక్రమాలే.విద్యార్ధుల తల్లితండ్రులు,తమ పిల్లలను విద్యాలయాలకు పంపేది విద్యాబుధ్ధులు నేర్పమనిగాని,ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలలో తర్ఫీదు ఇవ్వమని కాదు.
వెనకటికొకడు,పెళ్ళాం పిల్లలకు అన్నం పెట్టి దేశ సేవ చేశానన్నాడట.అలాగుంది ఈయన 30 ఏళ్ళు యూనివర్సిటీకి సేవ చేశాననడం.జీతం తీసుకోకుండా,నిస్వార్ధంగా విద్యార్ధులకు విద్యాబోధ చేస్తేనో,తన సొంతసొమ్ముతో యూనివర్సిటీకి లైబ్రరీ భవనాలో,ఆడిటోరియమో నిర్మించి ఇస్తేనో ,భూవిరాళం చేస్తేనో,దాన్ని సేవ చేయడం అంటారు కాని ఇది సేవ ఎలాగౌతుందో ఆయనే విశదీకరించాలి.చేశే ఉద్యోగానికి నెలనెలా జీతం పొందుతూనే ఉన్నాడు గదా!రాశేరె లక్ష కోట్లు దోచి రాష్ట్రానికి 5.1/2 ఏళ్ళు సేవచేశాననడం,గాలి జనార్ధన రెడ్డి,అక్రమంగా ఖనిజ సంపదను దోచి,దాన్ని విదేశాలకు తరలించి అప్పణంగా కోట్లు కూడబెట్టి,కర్ణాటకకు,దేశానికి సేవ చేశాననడం ఎంత నిజమో,ఈయనసేవ కూడా అంతే నిజం.
సర్కారు యుజిసి కి సొమ్ము మంజూరు చేస్తే,దానినుంచి యూనివర్సిటీలకు గ్రాంటు రూపంలో అందుతుంది.ఉద్యోగుల జీతభత్యాల దగ్గరనుంచి,ఉపాధ్యాయులు వివిధ సదస్సులలో పాల్గొనేటందుకు,మరియు అనేక ఇతర కార్యక్రమాలను నెరవేర్చేటందుకు అయ్యే వ్యయమంతా సర్కారు నుంచి అందేదే.దీన్నిబట్టి విషయ పరిజ్ఞానం,సరైన అవగాహన ఉన్న వ్యక్తి ఎవరికి విశ్వాసపాత్రుడుగా ఉండాలో తానే నిర్ణయించుకుంటాడుగాని,ఇలాంటి హాస్యాస్పద ప్రకటనలతో తన సామర్ధ్యలేమిని బహిర్గతం చేసుకోడు.ఏదిఏమైనా ఒక ప్రొఫెసర్ ,యూనివర్సిటీకి ,విద్యార్ధుల తల్లితండ్రులకు మాత్రం విశ్వసనీయుడుగా ఉండవలసిందే.
ఒక ఉపాధ్యాయుడుగా,సమాజానికి మార్గదర్శకుడుగా నిలవాల్సిన వ్యక్తి,ఒక పౌరుడిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తాననడం ఒక అలంకారిక పదప్రయోగం మాత్రమే.ఉద్యోగ బాధ్యతలను విస్మరించి చేపట్టే విధ్వంస కార్యక్రమాలకు,ఈ అత్మవంచనల కికనైనా స్వస్తి పలికి,ఒక సామాన్యపౌరుడిగా తన కర్తవ్యం(?) నిర్వర్తించాలనుకుంటే ,తక్షణమే ఉద్యోగానికి రాజీనామా చేసి,తన ప్రత్యర్ధులకు తొడ కొడతాడో,వాళ్ళతో కలబడతాడో తేల్చొకొంటే అది సమంజసంగా ఉంటుంది.
(నా స్నేహితుడు చలసాని శిశిర్ మార్గదర్శకంలో వ్రాసినది)

రాశేరె అడుగు జాడల్లో కి.కు.రె -ఖిన్నుడైన జగన్

రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కికురె, రాశేరె కి ఘనంగా నివాళుళు అర్పించారు.రాశేరె ప్రారంభించిన పధకాలన్నిటినీ కొనసాగిస్తానని,ఆయనకు అసలైన వారసులము తామేనని పునరుధ్గాటించారు.కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో తనలాంటివారు షుమారు 100 మంది రాశేరె తోబాటు కష్టనష్టాలనెన్నో ఎదుర్కొని ఆయనకు సహకారం అందించి,ఇటుక ఇటుక పేర్చబట్టే ఆయన రాజకీయంగా ఎదిగాడని,కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రోత్సాహంతోనే రెండుసార్లు ముఖ్యమంత్రి అవగలిగాడని విశదీకరించారు.ఈ క్రమంలోనే ఆయన రెండు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు.
రాశేరె తనకొక పని పురమాయించారని,కానీ స్పీకర్ విధినిర్వహణలో తనకు కొన్ని నియమనిబంధనలున్నాయని ,వాటిని అతిక్రమించడం భావ్యం కానందున , ఆ పని చేయడానికి తాను తిరస్కరించానని తెలిపారు.ఈ ఉదంతం గురించి ఇప్పుడు మాట్లాడటంలో ము.మం ఉద్దేశ్యం ఏదైనా ఒక సంగతి మాత్రం విష్పష్టం.అన్నిపార్టీల ప్రజాప్రతినిధులను సమదృష్టితో చూసి,నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ను,నిబంధనలకు విరుధ్ధంగా పనిచేయమని అప్పటి ము.మం రాశేరె పురమాయించాడంటే తన మంత్రివర్గ సహచరులతోను,అడుగులకు మడుగులొత్తే అధికారగణంతోను,ఎన్ని అకృత్యాలు ఏస్థాయిలో చేయించిఉంటాడో ఊహకందని విషయం.రాశేరె అడుగుజాడలలో నడుస్తూ ఈయనెన్ని అకృత్యాలకొడగడతాడో గదా!ఇప్పటివరకు రాశేరె మీద ప్రతిపక్షాలు అభియోగించిన అధికారదుర్వినియోగ ఆరోపణలన్నీ నూటికినూరు శాతం నిజాలని ము.మం. అంగీకరించినట్లైంది.రాశేరె ము.మం.గా స్పీకర్ కి.కు.రె కి పురమాయించిన పనేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రస్తుత ము.మం. కికురె పై ఉంది.
కికురె ప్రస్తావించిన రెండో అంశం పరిటాల రవి హత్యోదంతం.పరిటాల రవి హత్యకు జగన్ బాధ్యుడని ప్రతిపక్షం చేసిన ఆరోపణలను 60 రోజులు అసెంబ్లీలో ఎదుర్కొన్నాని,రాశేరె తనమీద పూర్తివిశ్వాసం ఉంచి తననొక్కమారుగూడా ఈవిషయం గురించి అడగలేదని చెప్పుకొచ్చారు.రాశేరె మీద వాలిన ఈగనుకూడా చంపకుండా వదలలేదని,ఆకుటుంబం మీద వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలోనే తెదేపాతో శతృత్వం పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు.తన సహచర ప్రజాప్రతినిధి హత్యకు గురైతే ,హత్యకు పాల్పడినవారిని గుర్తించే పరిశోధనకు సహకరించి , దోషులకు శిక్ష పడేలా చూడటం ఒక ప్రజాప్రతినిధిగా,శాసనకర్తగా ఆయన కర్తవ్యం.తన బాధ్యతను విస్మరించి ,నిజానిజాలతొ,న్యాయాన్యాలతో సంబధం లేకుండా ఒక ముఠా సభ్యుడుగా,ఒక వర్గం ప్రతినిధిగా తాను చేసిన సిగ్గుమాలినపనినొక సుగుణంగా చూపించడానికి ప్రయత్నించడం నీతిబాహ్యమైన చర్య.ఫూడల్ భావజాలంతో , ఒక సంకుచిత చట్రంలో ఇమిడిన వ్యక్తిగానే కికురె ని అభివర్ణించాలి.
రాశేరె రాజకీయవారసులు తమ వంటివారేనని యోగ్యతాపత్రం ఇచ్చుకొన్న కికురె,ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ఎన్ని అఘాయిత్యాలకొడగడతాడో,ఎన్ని దోపిడీలకు పాల్పడతాడో,ఎన్ని స్కాములు నెరపుతాడో వేచిచూడాల్సిందే!కాంగ్రెస్ ను కేంద్రంలోను రాష్ట్రంలోను గెలిపించిన ఘోర తప్పిదానికి ఆంధ్రప్రదేష్ ప్రజలింకెంత మూల్యం చెల్లించాలో?

రెండురెళ్ళుఆరు-ఆంధ్రప్రదేష్ నం .1

'ఒకేదెబ్బకు రెండు పిట్టలు ' అనే సిధ్ధాతం అమలుచేస్తూ,ప్రతిపక్షం తెదేపా ను మరియు తెలంగాణా ప్రాతంలో జగన్ ప్రభావాన్ని నామమాత్రం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడిన వికృతరాజకీయక్రీడలో భాగమే డెసెంబర్ 9,2009 న చిదంబరం ప్రకటన.ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులనుంచి ఎదురైన ప్రతిఘటనను ఏమాత్రం అంచనా వేయలేని కాంగ్రెస్ అధిష్ఠానం ,సంకటపరిస్థులనుంచి తాత్కాలిక ఉపశమనం పొందడానికి,కొంత అదనపు సమయం గడించడానికి చేసిన ఏర్పాటే శ్రీకృష్ణ కమిటీ అన్నవిషయం మనకందిరికీ తెలుసు.
'రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్ళతో సమానం' అనే స్లోగన్ తో గెడ కర్ర మీదెక్కిన యాక్రోబాట్ లా విన్యాసాలు చేస్తూ ,సంకటస్థితి నుంచి చాకచక్యంగా అతితక్కువ నష్టంతో బయటబడగలిగాడు చంద్రబాబు.
'ఆ రెండూ నాకొద్దు అని ,సోనియా తమ కుటుంబాన్ని చీల్చిందన్న కుంటిసాకుతో పార్లమెంట్,అసెంబ్లీ స్థానాలకు తల్లితో సహా రాజీనామా చేయించి,కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు జగన్.
'రెంటికీ చెడ్డ రేవడయ్యిందీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.ఈ సమస్యను పార్టీలే పరిష్కరించాలని,చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిన చిదంబరం వ్యూహాన్ని ,కెసిఆర్ చూపిన బహిష్కరణ మార్గం ద్వారానే ఛేదించాడు చంద్రబాబు.ఏడ్చి,మొత్తుకొని ప్రణబ్ ముఖర్జీ కాళ్ళమీదపడిన తెలంగాణా ప్రజాప్రతినిధులకు జగన్ బూచిని చూపాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీది.తమ అబధ్ధపు ప్రచారాలలోని డొల్లతనాన్ని,ప్రభుత్వం సమకూర్చిన సాధికారక గణాంకాల తోడ్పాటుతోనే ఎత్తిచూపిన శ్రీకృష్ణ కమిటీని ఆడిపోసుకోవడం,నివేదికను పక్కనబెట్టి ,ప్రత్యేక తెలంగాణా బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే పెట్టాలనే తొండి వాదననే నెత్తికెత్తుకోవాల్సిన దుస్థితి ప్రత్యేకవాదులది.
'రెండు రెళ్ళు ఆరు లాంటి అసంబధ్ధ రాజకీయక్రీడలకికనైనా ముగింపు పలికి ,శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరో ప్రత్యామ్నాయం ఎంచుకొని ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నం.1 గా తీర్చిదిద్దటం కాంగ్రెస్ పాలనలోనున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.