వెన్ను పోట్లు దాని పుట్టు పూర్వోత్తరాలు



రాజకీయాల్లో వెన్నుపోట్ల శకం ఆరంభమైనది ఇందిరాగాంధీతోనే . లాల్ బహదూర్‌శాస్ట్రి చనిపోగానే అందరికంటే సీనియర్ మరియు ఆ పదవికి అన్ని విధాలా అర్హుడు అయిన మొరార్జీ ను పక్కనబెట్టి ఇందిర ను ప్రధానమంత్రి ని చేసింది కామరాజ్ నేత్రుత్వం లోని సిండికేట్. తననా పదవిలో కూర్చోబెట్టిన సిండికేట్ కు వెన్నుపోటు పొడిచి రాజకీయంగా నామరూపాల్లేకుండా చేసింది ఇందిరాగాంధీ . సంజీవరెడ్డి ని దేశాధ్యక్షుడు గా తనే ప్రతిపాదించి అంతరాత్మ ప్రభోదం అనే కొత్త దుస్సంప్రదాయంతో వి వి గిరి ని గెలిపించి సంజీవరడ్డికి వెన్నుపోటు పొడిచింది ఇందిర . తనకు కేంద్రం లో పదవి ఇవ్వలేదనే అక్కసుతో తెలంగాణా ప్రజా సమితి ని స్థాపించి తన వాఘాటితో ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఎన్నికల్లో పది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని పదవీ వ్యామోహంతో మూకుమ్మడిగా కాంగ్రెస్స్ లో దూరి తెలంగాణా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చెన్నరెడ్డి . ఇందిర చే ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి గా నియమింపబడ్డ వెంగళరావు ఆమె దివి సేమ ఉప్పెన బాధితులను పరామర్శించడానికి వస్తే అప్పుడు పదవిలో లేదు కాబట్టి విజయవాడ మున్సిపల్ అతిధిగ్రుహం గది ఇవ్వకుండా నిరాకరించి ఆమెకు వెన్ను పోటు పొడీచాడు .
ఆంధ్రప్రదేశ్‌నుంచి జనతా పార్టీ తరఫున ఏకైక పార్లమెంట్ సభ్యుడు గా గెలిచి పార్టీ తనను పార్లమెంట్ స్పీకరు గా తరువాత దేశాధ్యక్షుడు గా గెలిపిస్తే జగజీవనరాం ను ప్రధానమంత్రి అవకుండా కాలడ్డి తదుపరి మధ్యంతర ఎన్నికల్లో ఇందిర ప్రాధాని గా గెలవడానికి పరోక్షంగా దోహదపడి జనతా పార్టీకు వెన్నుపోటు పొడిచాడు సంజీవరెడ్డి .రాజీవ్‌గాంధీ సిఫార్సుతో 1983 లో పిసిసి అధ్యక్షుడు గా నియమించబడీ , అదే రాజివ్‌గాంధీ చే నియమించబడిన ముఖ్యమంత్రుల మీద అసమ్మతి కార్యక్లాపాలు నడిపి , హైదెరాబాద్‌లో మతకలహాలు స్రుష్టించి రాజీవ్ కు వెన్నుపోటు పొడిచాడూ రాజశేఖరరెడ్డి .లెగిలేటివ్ కౌన్సిల్ లో తన వాగ్ధాటి తో చెన్నారెడ్డి ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు గుప్పించి , చీల్చి,చెండాడి వారం రోజులు తిరక్కుండానే కాబినెట్ లో చేరి  ఆనాటి  ` ఈనాడు `    ఛీఫ్ ఎడిటర్ గజ్జెల మల్లారెడ్డి చే మగలంజ గా శ్లాఘించబడి నీతి ,నిజాయతీలకే వెన్నుపోటు పొడిచాడు రోశయ్య .
తెలుగు దేశం పార్టీ ద్వారా వెలుగు లోకి వచ్చి మంత్రి గా డెపూటీ స్పీకర్‌గా పదవులనుభవించి తనివి తీరని అధికార దాహంతో పార్టీ కు వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి , తెలంగాణా అనే భావోద్వేగ నినాదంతో కాగ్రెస్స్ తో జతకట్టి , ఎన్నికల్లో గెలిచి పదవులనుభవించి కాంగ్రెస్స్ తో వెన్నుపోటు పొడిపించుకొని , గత్యంతరం లేక టిడిపి తో జతకట్టి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రాపకం తో నే గెలిచి ,టిడిపి ను తెలంగాణా లో భూస్థాపితం చేస్తానని రోజూ ఒక పోటు పొడుస్తూనే ఉన్నాడు కెసిఆర్.
ఇక జార్ఖండ్ లో శిబు సొరేన్ ఒక సారి బిజెపి కి మరో సారి కాంగ్రెస్  కు మార్చి మార్చి పోట్లు పొడుస్తూ ఉన్నాడు . తమిళనాడు లో కాంగ్రెస్  రెండు ద్రవిడ పార్టీలతో ఒకదాని తర్వాత ఒక దాన్ని పొడుస్తూనే ఉంది . కర్ణాటక లో ప్రస్తుత పరిస్థితి బిజెపి, కాంగ్రెస్,జెడియస్ ల లో ఎవరు, ఎవరిని, ఎప్పుడు  వెన్ను పోటు పొడుస్తున్నారో వాళ్ళకే తెలియనంత హాస్యాస్పద, జుగుప్సాకర రీతిలో మూడు పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి .
అణుఒప్పందం బిల్లు విషయం లో సొంత పార్టీ వాళ్ళకంటే   ఎక్కువ మద్దతిచ్చి ,ప్రతి గండం లోనూ బాసటగా నిలిచిన లాలూప్రసాద్ ను బీహార్ వెనుకబాటుకు మూల కారణంగా చూపుతున్న సోనియా పెద్ద వెన్నుపొటుదారు . అధికార దాహంతో ఎంతో క్రమ శిక్షణ  గల  తల్లి లాంటి పార్టీ కి వెన్నుపోటు పొడిచాడు మాజీ స్పీకర్ సోంనాథ్ ఛటర్జీ  .ఇక చిన్నా చితకా రాజకీయనాయకుల చరిత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మందా జగన్నాధం , ఆదికేశవులనాయుడు చంద్రబాబుకు  , బొత్సా సత్యనారాయణ మరియూ తులశీరెడ్డి రాజశేఖరరెడ్డి కుటుంబానికి పొడిచిన పోట్లు పెద్దవే.
చంద్రబాబు అసెంబ్లీ బల నిరూపణలో శాసనసభ్యుల మద్దతుతోనే గెలిచి ముఖ్యమంత్రి  అయ్యాడనేది  జగమెరిగిన సత్యమే . 1996, 1998, ల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాడు . 1996 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తో కలిసి యంటీఆర్‌టిడిపి అనే పేరుతో పోటీ చేసిన లక్ష్మీపార్వతిని ప్రజలు తిరస్కరించారనే విషయం అందరికీ గుర్తుండే వుంటుంది . 1999 లో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబును ఇంకా వెన్నుపోటుదారునిగా చిత్రించడం రోశయ్య లాంటి ఫ్యూడల్ భావాలతో వ్యక్తిపూజ  చేసే  నాయకునికి  తగనిపని .
ఈ ప్రజాస్వామ్య వ్యవస్తలో వెన్నుపోటు అనే పదానికి అధికారికత (sanctity) లేదనేది నా నిశ్ఛితాభిప్రాయం  . పైన ఈ అభియోగం మోపబడ్డ రాజకీయనాయకుల్లో చాలామంది తదనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచినవాళ్ళే . ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయనాయకుడు ఆరోజు ఉన్న పరిస్థితులకనుగుణంగా తమ విచక్షణను వినియోగించి , తమ శ్రేయస్సు కోసం, కొంత సమాజశ్రేయస్సు కోసం పరస్పర విరుధ్ధ నిర్ణయాలను తీసుకొనవలసి వస్తుంది . వాటన్నిటినీ  వెన్నుపోట్లుగా అభివర్ణిస్తే ప్రతి రాజకీయనాయకుడికీ చేతిలో  కత్తి ఉంటుంది వెన్నులో పోట్లుంటాయి .

పేరు మార్పు - ప్రగతి పధం లో మన రాష్త్రం

ప్రియతమ ముఖ్యమంత్రి రోశయ్య గారికి ,
తెలుగు లలిత కళాతోరణం ముందు రాజివ్ పేరు తగిలించినందుకు మీకు నా మనహ్‌పూర్వక అభినందనలు . మీరు రాజశేఖరరెడ్డి గారి  అడుగు జాడలలో   నడుస్తూ ఆయనకు మించిన కీర్తి(?) ని గడించాలని కోరుకొంటున్నాను .మీరు ఇదే స్పూర్తిని కొనసాగించి ప్రతి జిల్లా పేరు ముందు రాజివ్ పేరు గాని ఇందిర పేరు గాని తగిలించండి .ఇందిరా పొట్టిశ్రీరాములు   నెల్లూరు జిల్లా,రాజివ్‌వైయస్సార్ కడప జిల్లా  ల లాగా అన్న మాట .ప్రతి మండలానికి ముందు సోనియా ,రాహుల్,ప్రియాంకా పేర్లు , ప్రతి గ్రామ పంచాయతీ ముందు ప్రియాంకా పిల్లల పేర్లు (అవి నాకు తెలియనందుకు నన్ను మన్నించాలి ) తగిలించండీ .ఇక ప్రతి బస్ స్టాండ్ , రైల్వే స్టేషన్లకు ( వాటిలో ఉన్న సులభ కాంప్లెక్ష్ లకు గూడా) గాంధీల కుటుంబం లో ఎవరో ఒకరి పేరు తగిలించండి . ప్రభుత్వ ఆసుపత్రులకు (రాజీవ్ NIMS   ఆసుపత్రి , ఇందిరా ఉస్మానియా ఆసుపత్రి ) ,ప్రభుత్వ భవన సముదాయాలకు (రాజీవ్ సచివాలయం, ఇందిరా బూర్గుల రామక్రుష్నారావు భవనం ), ప్రభుత్వ రంగ సంస్థల  (ఇందిరా BHEL , రాజీవ్ ECIL ), అన్ని మున్సిపాలిటీల (రాజీవ్ GHMC , ఇందిరా VUDA)పేర్లు మార్చమని సిగ్గు లజ్జ లేని తెలుగు వాడిగా మిమ్ములను డిమాండ్ చేస్తున్నాను.
ఇప్పటికే ఉన్న ప్రైవేటు సంస్థలన్నిట్కీ విధిగా పేర్లు మార్చాల్సిందే (రాజీవ్ మైక్రోసాఫ్ట్, ఇందిరా ఇన్‌ఫోసిస్,సోనియా సత్యం ). ఇక్కడ ఏ బుధ్ధిమాలినవాడెవడన్నా   కొత్తగా పరిశ్రమలు పెడతానని వస్తే ఈ విధంగా పేర్లు పెడితేనే రాయితీలు ఇస్తామని ప్రకటించండి .అలా సిధ్ధమైన పారిశ్రామికవేత్తలకు ఎంత భూమి కావాలన్నా ఉచితంగా ఇస్తామని చాటండి.(రైతులెలాగూ వర్షాలు పడకో,వరదలొచ్చో , ఎరువులు దొరక్కో , మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర అప్పు చేసో , మిల్లర్లు ధాన్యం కొనకో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.వాళ్ళ  భూమినంతా జాతీయం చేద్దాం.సర్కారు భూమి అంతా మీ ముందాయన వదిలి పెట్టకుండా భోంచేశాడు  గదా  ). ఇక నుంచి మన రాష్ట్రం లో పుట్ట బోయే ప్రతి శిశువు కూ గాంధీ కుటూంబం లో వాళ్ళ పేరే ఏదో ఒకటి పెట్టాలని శాసనం చేయండి .
ఆ చేత్తోనే సోనియా గాంధీ గారికి  గఠ్ఠిగా ఉత్తరం వ్రాయండి . మన పార్టీ అధ్యక్షుడు గా చేసిన దేవకాంత్ బారువా గారన్నట్లుగా  ఇండియా పేరును గూడా ఇందిరా గా మార్చమని . వందేమాతరం , జనగణ మన ల లో సవరణలు చేసి వీలైనన్ని సార్లు ఇందిరా ,రాజీవ్ పేర్లను దూర్చమని గాఠ్ఠిగా డీమాండ్ చేస్తూ ,
                                                                        ఇట్లు
                                                         మీ  వేపకాయ వెర్రినాధం
                      జై ఇందిరా హింద్  ,  వందే రాజీవ్ మాతరం

టీవీ చూస్తే పిచ్చెక్కుతుందా ?

బ్రిస్టల్ యూనివర్సిటీ లోని సెంటర్ ఫర్ ఎక్సెరసైజ్, నుట్రిషన్ అండ్ హెల్త్ సైన్సెస్ డాక్టర్ ఏంజి పేజ్ పరిశోధనల ద్వారా తేలింది ఏమిటంటే పిల్లలు శారీరక కార్యకలాపాల్లో ఎంత చురుగ్గా పాల్గొన్నా రనే విషయంతో సంబంధం లేకుండా రెండు గంటలు టీవీ చూసినా,కంప్యుటర్ వాడినా పది పదుకొండేళ్ళ వయసున్న పిల్లలకు మానసిక పరమైన సమస్యలు వస్తాయని, ఎంతో కొంత మేరకు పిచ్చెక్కు తుందని .
ఈ పరిశోధనా ఫలితాలు చూసింతర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలకు దీనికి ఏమన్నాసంబంధం ఉందా అనే అనుమానం నాలో తలెత్తింది.బేస్ బాల్ బ్యాట్ తో ఆడ పిల్ల తల చితక్కొట్టి , వేరే అబ్బాయితో సన్నిహితం గా ఉంటం చూల్లేకే అలా చేయాల్సి వచ్చిందని టీవీల్లో సమర్ధ్ధించు కోవడం చూశాక భయంకరమైన పిచ్చి లేకపోతే అలా చేయడం సాధ్యమా? అనిపించింది.ఈ కోవకే చెందిన పిచ్చి పనులు ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు , కత్తి తో గొంతు కొయడాలూ,ప్రేమిస్తావా? చస్తావా ? అని వెంట బడతాలు నిత్యకృత్యాలు అయిపోయాయి.
వేరే తరహా పిచ్చి పనులు కూడా చాలా చూస్తున్నాం . ఒక రాజకీయనాయకుడు పోయాడని , ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయలేదని , ఆయన్ను రాజకీయం గా ఇబ్బంది పెడుతున్నారని,ఎవరో ఒక స్వార్థపరుడు తన వ్యక్తిగత ఎజండా తో నిరాహార దీక్షకు దిగాడు అనో,ఒక రాజకీయ నాయకుడిని అరెస్టు చేసారనో,ఒక అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయిందని, ఒక ప్రత్యేక రాష్ట్రం రాలేదనో, ఆతహత్యాలు చేసుకుంటున్న యువతీయువకుల గురించి రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ రకమైన పెడ ధోరణులకన్నిటికీ 90 వ దశకం లో వచ్చిన టీవీ విప్లవమే కారణమా ? లేక ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఆర్థిక అసమానతలే అగ్నికి ఆజ్యం పోసి యువతలో ఈ విధంగా విక్రుత రూపంలో బహిర్గతమవుతున్నదా ? ఈ సమస్య గురించి తల్లితండ్రులు, సామాజిక శాస్త్రవేత్తలు , మానసిక నిపుణులు ఒక వేదిక మీదకు వచ్చి చర్చించి తగు పరిష్కారాలను సూచించ వలసిన అవసరం ఉన్నది
చిన్న పిల్లల తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి. మీ పిల్లలు టీవీ ముందు, కంప్యూటర్ ల ముందు గడిపే సమయాన్ని వీలైనంతవఱకు తగ్గించండి . పిల్లలకు కధలు చెబుతూ , వాళ్ళ ఆట పాటల్లొ పాలు పంచుకొంటూ వాళ్ళను పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చి దిద్దండి . పిల్లలకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేదనికంతే వారితో మీరెంత సమయం గడుపుతున్నరో అదే ప్రేమకు కొల బద్దగా తీసుకొంటారు.(ఉదా:-ఒక యువకుడు తనకు కొనిపెట్టిన మోటర్ సైకిల్ ను తుడవడానికి అది మెరవడానికి ఎంతో సమయం వెచ్చిస్తాడు కాని , నువ్వంటే  నాకిష్టం అని దానితో చెప్పడు ) . మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లొనే ఉందని గ్రహించండి . prevention is better than cure . ( కంటి పాపలై దంపతులెపుడూ  చంటి పాపలను సాకాలోయి  అనే ఘంటసాల పాత పాట సందర్భానుచితం అని నమ్ముతూ)

తెలుగు తల్లి ముద్దు బిడ్డలా - తెలంగాణా నరమేధం లొ సమిధలా

తెలంగాణా అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షుడు  రఘుమారెడ్డి నాయకత్వం లో 30మంది అమరవీరుల కుటుంబ సభ్యులు తెలంగాణా భవన్ ముందు ధర్నా చేసి తెరాస కు వ్యతిరేకం గా నినాదాలు చేసినట్లు , తెలంగాణా అమరవీరుల పేరిట దోచుకోవడం ఆపండి , చావులు మాకు పదవులు మీకా ? అని ప్లకార్డులు ప్రధర్సించినట్లు వార్తలు వచ్చాయి.
శ్రీ కాంతాచారి తల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, తన తనయుడి చావుకు తెరాస కారణమని ఆక్రోశించిందని , తెరాస పార్టీ వాళ్ళు తన కొడుకు ను వెంటేసుకొని తిప్పటం మూలాన అసలే ఉద్యేగాస్వభావు దైనందున ఆత్మహత్య చేసుకోన్నాడని, ఈ బలిదానానికి వెల కట్టవద్దని విలపించింది అంటే ఎంత కఠిన హ్రుదయులకైనా గుండె ధ్రవించక మానదు.
పరిస్థితులు ఇంత హ్రిదయ విదారకం గా ఉంటె కెసిఆర్ చేసిన ప్రకటన ` తెలంగాణా ఇవ్వకుంటే మానవ బాంబులు అవుతాం` అనేది పుండు మీద కారం చల్లినట్లు గా ఉంది.ఏమిటీ బాధ్యతా రాహిత్యం ? ఏమిటీ వాచాలత్వం? ఏమిటీ అరాచకత్వం ?
తమంత తాము మేధావులని పిలిపించుకొనే కోదండరాం, జయశంకర్ లాంటి నాయకులు ఎందుకిలా యువతను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు? తెలుగు తల్లి ముద్దు బిడ్డలైన వీళ్ళంతా మట్టిలో కలసిపోయిన మాణిక్యాలు. ఈ తెలుగు తల్లి ముద్దు బిడ్డల మనసుల్ని కలుషితం చేసి తెలంగాణా బిడ్డలు గా పిలిచే అధికారం మీకేవరిచ్చారు? ఆత్మహత్య లను ప్రోత్సహించడం కూడా నేరమని ఈ కుహనా మేధావులకు తెలియదా? చేతికందిన బిడ్డలు ఒక ఉద్యేగా భరిత వాతావరణం లో భయంకరమైన మ్రిత్యువు ఒడి లోకి జారిపోతే ఆ తల్లితండ్రుల ఘోష,క్షోభ మీ కర్ణ పుటా లను బద్దలు చేయటం లేదా?
ఇకనైనా ఈ స్వార్థపూరిత, నిరర్థక నరమేధం ఆపండి.ఓ దగా పడిన తల్లులారా , తండ్రులారా మీ / మా అనుంగు బిడ్డల బలిపీటం మెట్లెక్కి సింహాసనం అధిష్టించాలనే క్షుద్ర రాజకీయనాయకులను తరిమి తరిమి కొట్టండి .

గద్దర్ కు ప్రశ్నలు - నా జవాబులు


7 తారీఖు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో తిగుళ్ల కృష్ణమూర్తి గారు `గద్దర్ ఫ్రంట్ రేపుతున్న ప్రశ్నలు` అనే వ్యాసం లో చాలా ప్రశ్నలు రేపారు . 
గద్దర్ తో సహా ఫ్రంట్ లోని నాయకులంతా ఏదో ఒక సందర్భం లో కె సి ఆర్ కు మద్దతు ప్రకటించినవారు కాదా ?తో మొదలుపెట్టి తెలంగాణా ఏర్పాటుకు ప్రధాన అడ్డంకి అని తెలంగాణా వాదులంతా నమ్ముతున్న తెలుగుదేశాన్ని కూకటి వెళ్లతో సహా పేకలించి వేసే పనిలో కేసిఆర్ తలమునకలై ఉన్నప్పుడు ఆయన చాప క్రిందకు నీరు తెచ్చి ,ఆత్మ రక్షణలో పడేసే రీతిలో ఇప్పటికిప్పుడు ఫ్రంట్ ఆవిర్భవించటం లో అంతరార్థం ఏమిటి ? దాకా ఎన్ని నయ వంచనలో ఎంత అతి తెలివి ప్రశ్నాలో ? 
కేసిఆర్ పార్టీ లోంచి వచ్చాడో?మంత్రి పదవిలో ఉంచి నంత కాలం చాలా మంచి పార్టీ . డెప్యుటీ స్పీకర్ పదవి ఇస్తే నచ్చ బయటకు వచ్చి , కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రి పదవి నలంకరించి తర్వాత ఎన్నో కుప్పిగంతులేసి తన పార్టీ వాళ్ళతో, ఉప ఎన్నికల్లో ప్రజలతో ఛీ కొట్టించుకొని కాంగ్రెస్ వాళ్ళు తన్ని తగలేస్తే , అక్కున జేర్చుకొని మహా కూటమిలో భాగస్వామి ని చేసి కోరిన గొంతేమ్మకోరికలన్ని తీర్చి మద్దతిచ్చి పార్లమెంట్ కు పంపితే , వేళ కూకటివేళ్ళతో పేకలించవలసిన పార్టీ అయిందా ? ఎంత విశ్వాస ఘాతకం? ఒక ప్రజా గాయకుడు తెలంగాణా తేవడం కోసం ఫ్రంట్ పెడితేనే చాప క్రిందకు నీళ్ళొచ్చి , ఆత్మరక్షణ లో పడితే నాయకుడి సత్తా ఏమిటో తెలియదంలేదా? 
` ప్రజా గాయకుడు ఎంత వరకు ప్రజానాయకుడు అవుతాడన్నది అసలు సంగతి`  
నాయకత్వం ఎవడిఆబ్బసొత్తా? అసలు సంగతేంటో చూస్తే గదా తెలిసేది ! 
`మంచో చెడో ,ఒంటి గానో జంట గానో ,ఎత్తుగాడో మెత్త బడో , తెలంగాణా ఉద్యమాన్ని కేసిఆర్ పదేళ్ళనుంచి బహుముఖం గా విస్తరించారు ` 
చాలా బాగా చెప్పారు గాని విస్తరించింది మాత్రం కేసిఆర్ కుటుబం . 
`సుదీర్ఘ ఉద్యమాన్ని ఫలితం దాకా తీసుకొచ్చి వ్యక్తి ప్రయోజన ఫలం లో వాటా కాంక్షించటం రాజకీయాలలో అసహజమేమీ కాదు ` 
జగన్ వాళ్ళ నాయన పోయిన తర్వాత రోజూ మొత్తుకొనెది అదే కదా ! 
`రాజకీయ పార్టీ అక్రమ సంపాదన తప్పేమీ కాదు.కెసి ఆర్ ఉద్యమ బలాన్ని చూపించి సంపాదించారు . అక్రమ సంపాదన లేకుండా రాజకీయాలు , ఉద్యమాలు నడపడం అయ్యే పనేనా ?` 
ఎంత బహిరంగం గా , నిర్లజ్జగా, అక్రమ సంపాదనను సమర్ధించే యన తెంపరితనానికి నా జోహార్లు. రాబోయే తెలంగాణా రాష్ట్రం లో అవినీతి నిరోధక శాఖ , విజిలెన్స్ లాంటి వాటితో పనే లేదన్నమాట . 
`మిగతా ఉద్యమకారులు కూడా కొడుకులు కూతుల్ల ఉద్యోగాలు మాన్పించి ఉద్యమం లోకి తీసుకొస్తే కాదన్నవారెవ్వరు?` 
మహానుభావుడు 70 సం లేటుగా పుట్టాడు . లేకుంటే మహాత్మా గాంధీ కి కూడా ఇదే ఉపదేశం చేసేవాడే. 
`మా లో మేము కోట్లాడుకున్నప్పుడు మేం ఇదుగురమ్,వారు నూరు మంది . మరెవరైనా మాపైకి వస్తే మాత్రం మేం 105 మంది అన్న ధర్మరాజు యుద్ధనీతిని గద్దర్ కు ప్రత్యేకం గా చెప్పనక్కర లేదు.` 
తెలంగాణా నాయకుల్లో పాండవులెవరో , కౌరవులెవరో యన చెప్పలేదు కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం కురుక్షేత్ర యుద్ధం తప్పదని చెప్పకనే చెప్పాడు . 
`తెలంగాణా కు శత్రువు ఎక్కడో లేడు. మన తెలంగాణా లోని కలసి నడవని అనైక్యతలోనే,ఎరకు ఆశ పడే అమాయకత్వం లోనే,అమ్ముడు పోయే తత్వం లోనే ,ఆరంభశూరత్వ ఆశక్తత లోనే ` 
సర్వ అవలక్షణాలు ఉన్నాయని ఒప్పుకుంటూనే స్వయం పాలన కావాలి అని అనడం సబబా ? 
`నాయకుడు లేక పోయినా పని చెడిపోతుంది , అనేక మంది నాయకులున్నా అంతే సంగతులవుతుంది ` 
అసలు మీకు కావాల్సినది ప్రజాస్వామ్యమా? దొరల రాజ్యమా ? 
 
ఇంత అపరిపక్వ . శూన్య సిద్ధాంత ,బరితెగించిన లేకి నాయకత్వమా తెలంగాణా కు కావలసినది ? విజ్ఞ గల తెలంగాణా వాదులారా ఆలోచించండి .