రెండురెళ్ళుఆరు-ఆంధ్రప్రదేష్ నం .1

'ఒకేదెబ్బకు రెండు పిట్టలు ' అనే సిధ్ధాతం అమలుచేస్తూ,ప్రతిపక్షం తెదేపా ను మరియు తెలంగాణా ప్రాతంలో జగన్ ప్రభావాన్ని నామమాత్రం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడిన వికృతరాజకీయక్రీడలో భాగమే డెసెంబర్ 9,2009 న చిదంబరం ప్రకటన.ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులనుంచి ఎదురైన ప్రతిఘటనను ఏమాత్రం అంచనా వేయలేని కాంగ్రెస్ అధిష్ఠానం ,సంకటపరిస్థులనుంచి తాత్కాలిక ఉపశమనం పొందడానికి,కొంత అదనపు సమయం గడించడానికి చేసిన ఏర్పాటే శ్రీకృష్ణ కమిటీ అన్నవిషయం మనకందిరికీ తెలుసు.
'రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్ళతో సమానం' అనే స్లోగన్ తో గెడ కర్ర మీదెక్కిన యాక్రోబాట్ లా విన్యాసాలు చేస్తూ ,సంకటస్థితి నుంచి చాకచక్యంగా అతితక్కువ నష్టంతో బయటబడగలిగాడు చంద్రబాబు.
'ఆ రెండూ నాకొద్దు అని ,సోనియా తమ కుటుంబాన్ని చీల్చిందన్న కుంటిసాకుతో పార్లమెంట్,అసెంబ్లీ స్థానాలకు తల్లితో సహా రాజీనామా చేయించి,కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు జగన్.
'రెంటికీ చెడ్డ రేవడయ్యిందీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.ఈ సమస్యను పార్టీలే పరిష్కరించాలని,చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిన చిదంబరం వ్యూహాన్ని ,కెసిఆర్ చూపిన బహిష్కరణ మార్గం ద్వారానే ఛేదించాడు చంద్రబాబు.ఏడ్చి,మొత్తుకొని ప్రణబ్ ముఖర్జీ కాళ్ళమీదపడిన తెలంగాణా ప్రజాప్రతినిధులకు జగన్ బూచిని చూపాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీది.తమ అబధ్ధపు ప్రచారాలలోని డొల్లతనాన్ని,ప్రభుత్వం సమకూర్చిన సాధికారక గణాంకాల తోడ్పాటుతోనే ఎత్తిచూపిన శ్రీకృష్ణ కమిటీని ఆడిపోసుకోవడం,నివేదికను పక్కనబెట్టి ,ప్రత్యేక తెలంగాణా బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే పెట్టాలనే తొండి వాదననే నెత్తికెత్తుకోవాల్సిన దుస్థితి ప్రత్యేకవాదులది.
'రెండు రెళ్ళు ఆరు లాంటి అసంబధ్ధ రాజకీయక్రీడలకికనైనా ముగింపు పలికి ,శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరో ప్రత్యామ్నాయం ఎంచుకొని ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నం.1 గా తీర్చిదిద్దటం కాంగ్రెస్ పాలనలోనున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం.

4 comments:

sri chikati,akasa ramanna,chandamama gaarlaku,
నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదాలు.

 

Post a Comment