రాశేరె అడుగు జాడల్లో కి.కు.రె -ఖిన్నుడైన జగన్

రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కికురె, రాశేరె కి ఘనంగా నివాళుళు అర్పించారు.రాశేరె ప్రారంభించిన పధకాలన్నిటినీ కొనసాగిస్తానని,ఆయనకు అసలైన వారసులము తామేనని పునరుధ్గాటించారు.కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో తనలాంటివారు షుమారు 100 మంది రాశేరె తోబాటు కష్టనష్టాలనెన్నో ఎదుర్కొని ఆయనకు సహకారం అందించి,ఇటుక ఇటుక పేర్చబట్టే ఆయన రాజకీయంగా ఎదిగాడని,కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రోత్సాహంతోనే రెండుసార్లు ముఖ్యమంత్రి అవగలిగాడని విశదీకరించారు.ఈ క్రమంలోనే ఆయన రెండు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు.
రాశేరె తనకొక పని పురమాయించారని,కానీ స్పీకర్ విధినిర్వహణలో తనకు కొన్ని నియమనిబంధనలున్నాయని ,వాటిని అతిక్రమించడం భావ్యం కానందున , ఆ పని చేయడానికి తాను తిరస్కరించానని తెలిపారు.ఈ ఉదంతం గురించి ఇప్పుడు మాట్లాడటంలో ము.మం ఉద్దేశ్యం ఏదైనా ఒక సంగతి మాత్రం విష్పష్టం.అన్నిపార్టీల ప్రజాప్రతినిధులను సమదృష్టితో చూసి,నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ను,నిబంధనలకు విరుధ్ధంగా పనిచేయమని అప్పటి ము.మం రాశేరె పురమాయించాడంటే తన మంత్రివర్గ సహచరులతోను,అడుగులకు మడుగులొత్తే అధికారగణంతోను,ఎన్ని అకృత్యాలు ఏస్థాయిలో చేయించిఉంటాడో ఊహకందని విషయం.రాశేరె అడుగుజాడలలో నడుస్తూ ఈయనెన్ని అకృత్యాలకొడగడతాడో గదా!ఇప్పటివరకు రాశేరె మీద ప్రతిపక్షాలు అభియోగించిన అధికారదుర్వినియోగ ఆరోపణలన్నీ నూటికినూరు శాతం నిజాలని ము.మం. అంగీకరించినట్లైంది.రాశేరె ము.మం.గా స్పీకర్ కి.కు.రె కి పురమాయించిన పనేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రస్తుత ము.మం. కికురె పై ఉంది.
కికురె ప్రస్తావించిన రెండో అంశం పరిటాల రవి హత్యోదంతం.పరిటాల రవి హత్యకు జగన్ బాధ్యుడని ప్రతిపక్షం చేసిన ఆరోపణలను 60 రోజులు అసెంబ్లీలో ఎదుర్కొన్నాని,రాశేరె తనమీద పూర్తివిశ్వాసం ఉంచి తననొక్కమారుగూడా ఈవిషయం గురించి అడగలేదని చెప్పుకొచ్చారు.రాశేరె మీద వాలిన ఈగనుకూడా చంపకుండా వదలలేదని,ఆకుటుంబం మీద వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలోనే తెదేపాతో శతృత్వం పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు.తన సహచర ప్రజాప్రతినిధి హత్యకు గురైతే ,హత్యకు పాల్పడినవారిని గుర్తించే పరిశోధనకు సహకరించి , దోషులకు శిక్ష పడేలా చూడటం ఒక ప్రజాప్రతినిధిగా,శాసనకర్తగా ఆయన కర్తవ్యం.తన బాధ్యతను విస్మరించి ,నిజానిజాలతొ,న్యాయాన్యాలతో సంబధం లేకుండా ఒక ముఠా సభ్యుడుగా,ఒక వర్గం ప్రతినిధిగా తాను చేసిన సిగ్గుమాలినపనినొక సుగుణంగా చూపించడానికి ప్రయత్నించడం నీతిబాహ్యమైన చర్య.ఫూడల్ భావజాలంతో , ఒక సంకుచిత చట్రంలో ఇమిడిన వ్యక్తిగానే కికురె ని అభివర్ణించాలి.
రాశేరె రాజకీయవారసులు తమ వంటివారేనని యోగ్యతాపత్రం ఇచ్చుకొన్న కికురె,ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ఎన్ని అఘాయిత్యాలకొడగడతాడో,ఎన్ని దోపిడీలకు పాల్పడతాడో,ఎన్ని స్కాములు నెరపుతాడో వేచిచూడాల్సిందే!కాంగ్రెస్ ను కేంద్రంలోను రాష్ట్రంలోను గెలిపించిన ఘోర తప్పిదానికి ఆంధ్రప్రదేష్ ప్రజలింకెంత మూల్యం చెల్లించాలో?

0 comments:

Post a Comment